Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈనెల 15 ఉచిత వెబినార్ను నిర్వహిస్తున్నది. ఈ వెబినార్లో నూతన ఆవిష్కరణలు- వ్యవస్థాపకత అంశంపై అవగాహన సదస్సు జరుగుతుంది. వ్యాపార మెలకువలు,వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, బ్యాంక్ ప్రాజెక్ట్ తయారీ విధానం, డిజిటల్ మార్కెటింగ్- ఫైనాన్షియల్, ఎమ్ఎస్ఎమ్ఈ పథకాలు వంటి అనేక అంశాల గురించి వివరిస్తారు. ఈ వెబినార్లో పాల్గొన్న వారికి స్టడీ మెటీరియల్తో పాటు సర్టిఫికేట్ కూడా ఇస్తారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ప్రోగ్రామ్ డైరెక్టర్ జి సుదర్శన్కు 9494959108, 04023633228 నెంబర్లలో ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.