Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ఓఎస్డీ గంగాధర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వృద్ధులు గౌరవప్రదమైన జీవి తాన్ని గడపడానికి వీలుగా సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి సేవలందించడం ప్రసంశనీయమని సీఎం ఓఎస్డీ, నిమ్స్ నెఫ్రాలజీ విభా గం అధిపతి డాక్టర్ టి గంగాధర్ అన్నారు. హైదరాబాద్లోని కొండా పూర్ సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం లో మంచాన పడ్డ రోగుల కోసం నూతనంగా నిర్మించిన అసిస్టెడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ (ఐసీయూ) కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారం భించారు. ఈ సందర్బంగా గంగా ధర్ మాట్లాడుతూ వృద్ధుల్లో చాలా మంది తమ మిగిలిన జీవితాన్ని శాంతియుతంగా గడపడానికి కష్టా లను, ఇబ్బందులని ఎదుర్కొంటున్నా రని చెప్పారు. సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం వారి అవసరాలను గుర్తించి సేవ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఐదు పడకల ఐసీయూ ఏర్పాటు చేయడం మొట ్టమొదటిది కావచ్చన్నారు. వృద్ధులకు పోషక విలువలతో కూడిన ఆహారం, ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయా లతో పాటు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని చెప్పారు. మం చాన పడ్డ వృద్ధులకు నిమ్స్లో వైద్య సేవలందించడానికి సీఆర్ ఫౌండే షన్కు సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఐసీయూ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించిన వృద్ధాశ్రమ వాసులు ఎన్ రాజేందర్రావు, సుగుణ, సుబ్బాలక్ష్మి, ఎన్ఆర్ స్వామి, ఇటీవలే మరణించిన అబ్బూరి ఛాయాదేవి, తమ్మారెడ్డి కనకరత్నంకు సీఆర్ ఫౌండేషన్ అధ్య క్షులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కృతజ్ఞతలు ప్రకటిం చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర్ రావు, కోశాధికారి వి చెన్నకేశవరావు, ఆరోగ్య కేంద్రం సంచాలకులు డాక్టర్ రజిని, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ సజన, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అసోసియేషన్ అఫ్ ఇండియా చైర్మెన్ బి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.