Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైకుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8:05 గంటలకు ప్రమాదం జరిగిన స్థలంలో సీసీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. బైక్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆటోను ఓవర్టేక్ చేయబోయి సాయిధరమ్ తేజ్ ప్రమాదవ శాత్తు కిందపడ్డారని డీసీపీ తెలిపారు. ప్రమాద సమయంలో 78 కి.మీ. వేగంతో బైక్పై సాయిధరమ్ వెళుతున్నాడని డీసీపీ పేర్కొన్నారు. ఎల్బీనగర్కు చెందిన అనిల్కుమార్ నుంచి బైక్ను సాయిధరమ్ కొన్నాడన్నారు. అనిల్కుమార్ను పిలిచి విచారిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఛాతి, కడుపు, కుడి కన్నుపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సాయితేజ్ను పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఆస్పత్రిలో పరామర్శించారు.