Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఆడుకుంటూ వెళ్లిన రెండేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతిచెందిన ఘటన హైదరాబాద్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఏఎస్ఐ శ్రీనివాస్రావ్ తెలిపిన వివరాల ప్రకారం..హయత్నగర్ డివిజన్ పరిధిలోని రంగనాయకుల గుట్టకు చెందిన వాంకు డోతు రాజు- సంతోషి దంపతులకు నూతన్ నందు,నిహారిక,నిత్య ముగ్గురు సంతానం. చాలా రోజులుగా దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. రాజు ఇటుక లారీలో డంపింగ్ పనులు చేస్తుంటాడు. సంతోషి ఇండ్లల్లో పనికి వెళ్తుంది. శనివారం ఉదయం సంతోషి పనికి వెళ్లింది. రాజు కూడా పనికి వెళ్లే సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్న కూతురు నిత్య కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వెతకగా చివరకు సంపులో కనిపించింది. చిన్నారిని సంపులో నుంచి బయటికి తీసే సరికి ప్రాణం కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.