Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేటలో ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
- కామారెడ్డిలో గణేషున్ని తీసుకొస్తుండగా ఒకరు..
- మేడ్చల్ శివారులో ముగ్గురు
నవతెలంగాణ-పాలకవీడు/భిక్కనూర్/ మేడ్చల్ రూరల్
వినాయక పండుగ వేళ పలు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలు సూర్యాపేట, మేడ్చల్, కామారెడ్డి జిల్లాల్లో జరిగాయి. మేడ్చల్ జిల్లా శివారులో కారు.. బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
సూర్యాపేట జిల్లా దామరచర్ల నుంచి జాన్పహాడ్ దర్గా వైపు వస్తున్న లారీ శుక్రవారం పాలకీడులోని రైల్వే ట్రాక్ వద్దకు రాగానే అదుపు తప్పి ముందు వస్తున్న ద్విచక్ర వాహనాలను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో బైక్లపై దర్గాకు వచ్చి వెళ్తున్న మిర్యాలగూడ మండలం జంకుతండాకు చెందిన భార్యాభర్తలు దనావత్ పున్యా(55), దనావత్ మగ్తి, మరో వాహనంపై వస్తున్న సయ్యద్ జానీ(50) అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలాన్ని హుజూర్నగర్ సీఐ పరిశీలించారు. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాలను హుజూర్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేశ్ తెలిపారు.
వినాయక విగ్రహాన్ని తీసుకొస్తుండగా..
కామారెడ్డి నుంచి భిక్కనూర్ పట్టణ కేంద్రానికి వినాయక విగ్రహాన్ని తీసుకొస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భిక్కనూర్ పట్టణానికి చెందిన సురేష్(25), శ్రావణ్, ఎల్లం కామారెడిలో వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్పై ఎక్కించి వెనుకాలే ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జంగంపల్లి బీటీఎస్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢకొీంది. సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రావణ్కు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఎల్లంకు కుడికాలు విరిగింది. స్థానికులు వారిని 108లో కామారెడ్డి ఏరియాస్పత్రికి తరలించారు. ఎస్ఐ నవీన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులతోపాటు బాలుడు(3) మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావివద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న కారు రాంగ్ రూట్లో అజాగ్రత్తగా నడుపుతూ అదుపు తప్పి రోడ్డు డివైడర్ను దాటి తూప్రాన్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని, మరో ద్విచక్రవాహనాన్ని ఢ కొట్టింది. దాంతో సారా లావణ్య(26), సారా కౌశిక్ (3), సుధీర్(26) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ బ్రహ్మణపల్లికి చెందిన సారా లావణ్య, కొడుకు కౌకిక్, తన అమ్మతో కలిసి శామీర్పేట మండలం జగన్గూడ గ్రామంలోని బందువుల ఇంటికెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోలో ఇంటికి వెలుతుండగా కారు ఢకొీనడంతో తల్లీకొడుకు మృతిచెందాడు.
ఇటీవలే పెండ్లి.. అంతలోనే ఇలా..
ఇటీవలే పెండ్లి చేసుకున్న సుధీర్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుధీర్ వర్మ(26) కొన్నేండ్ల కిందట ములుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటూ ఓ ప్రయివేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. సుధీర్కు ఇటీవల పెండ్లి అయింది. తండ్రి చాలా ఏండ్ల కిందటే చనిపోయాడు. అతని అక్క రెండు నెలల కిందట మృతిచెందింది. ఇప్పుడు అతనూ చనిపోవడంతో భార్య, తల్లి ఒంటరివారయ్యారు.