Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి
- సీఎం కేసీఆర్తో భేటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని (శంషాబాద్) అంతర్జాతీ య విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆయన హామీనిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో ఆరు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం రాష్ట్రానికి విచ్చేసిన సింధియా... హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు. సీఎంతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడు తూ..తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వృద్ధిని సాధిస్తున్న దని తెలిపారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుం టున్న నేపథ్యంలో ఇక్కడి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్రమంత్రిని కోరారు. ఐటీ, వాణిజ్య, వైద్య, పర్యాటక హబ్గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తున్నాయని వివరించారు. అందువల్ల దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు,పలు అంతర్జాతీయ నగరాల నుండి ప్రయాణీకులు ఇక్కడికొస్తున్నారని తెలిపారు. అందువల్ల సౌత్ ఈస్ట్ ఏషియా,యూరప్, యూఎస ్కు హైదరాబాద్ నుండి విమానాల అనుసం ధానాన్ని నేరుగా పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుండి అందిన ప్రతిపాదనలకు సంబంధిం చి..వివిధ పట్టణాల్లోని ఆరు ఎయిర్ పోర్టుల అభివృద్ధి ఆపరేషన్స్ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో ను అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.స్పందించిన సింధియా..వరంగల్ (మాము నూరు) ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్ (ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ను త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.నిజామాబాద్ జిల్లా (జక్రాన్పల్లి)ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ను ఇస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టును ఎయిర్ ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామ ని తెలిపారు.పెద్దపల్లి (బసంత్నగర్), కొత్తగూడెం, మహబూబ్ నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేందుకు వీలుగా పున: పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కేంద్ర మంత్రితో భేటీలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాజశేఖరరెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ కరోలా, సంయుక్త కార్యదర్శి దూబే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీఎంఆర్ సంస్థల చైర్మెన్ గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు.