Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైద్రాబాద్బ్యూరో
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ సబ్జెక్టులో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న కాసోజు గణేష్ చారి (29) ఆత్మహత్యకు ప్రభుత్వం, ఇంటర్బోర్డు కారణమని జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ విమర్శించారు. 18 నెలలుగా జీతాలు, ఉపాధి లేదనీ, యాజమాన్యాల నుంచి రావల్సిన మూడు నెలల జీతాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. భౌతిక తరగతులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైనా అన్ని కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల సేవలు అవసరమున్నా, ప్రభుత్వం, ఇంటర్బోర్డు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్లే గణేషాచారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. దీనికి ప్రభుత్వం, ఇంటర్ బోర్డు బాధ్యత వహించి, గణేష్ చారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 405 కళాశాలల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లను సత్వరమే రెన్యూవల్ చేసి, 3 నెలల పెండింగ్ జీతాల బడ్జెట్ విడుదల చేయాలని కోరారు.