Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రానికి చెందిన పరిశోధన విద్యార్ధికి జాతీయ ఉత్తమ యువజన అవార్డు లభించడం అభినందనీయమని ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ అవార్డుకు ఎంపికైన కాకతీయ యూనివర్సిటీ పరిశోధనా విద్యార్ధి, సామాజిక కార్యకర్త మహ్మద్ ఆజం ఆదివారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సన్మానించారు. జాతీయ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఏటా సామాజిక సేవరంగంలో విశిష్ట సేవలందించే 18-29 వయస్సుగల యువతకు జాతీయ ఉత్తమ యువజన అవార్డుకు ఎంపిక చేస్తారు. 2017-18 సంవత్సరానికి గానూ తెలంగాణకు చెందిన కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్లవిభాగ పరిశోధన విద్యార్థి, సామాజిక కార్యకర్త మహ్మద్ ఆజమ్ ఎంపికయ్యారు. ఈ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నారు.