Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరవీరులకు నివాళులర్పించిన ఉద్యమకారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెకు పదేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం గన్పార్కు స్థూపం వద్ద నాటి ఉద్యమకారులు సకల జనుల సమ్మె స్ఫూర్తి దినోత్సవంగా జరుపుకున్నారు. అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, స్వామి గౌడ్, అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండావిశ్వేశర్ రెడ్డి, గోవర్థన్, రఘు, పల్లె రవి, అశోక్, ఓయూ జేఏసీ నేతలు రమేష్ ముదిరాజ్, సలీంపాష, మాసంపల్లి అరుణ్ కూమార్ తదితరులు పాల్గొన్నారు.