Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 గేట్లు ఎత్తి నీరు విడుదల
నవతెలంగాణ -గద్వాల
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి1.02 లక్షల క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. దాంతో జూరాల 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నిల్వ ఉంది. 33,825 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని 5 యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. యథావిధిగా జూరాల నుంచి ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడికాల్వకు 774 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద దిగువ ప్రాంతానికి 1.309 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.