Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాదిపల్లి వీరస్వామి గౌడ్ క్యాష్ అవార్డ్ వాలీబాల్ టోర్నమెంట్ను బాగ్ అంబర్పేట్ ఇండోర్స్టేడియంలో ప్రారంభమైంది. దీనిని వి.హనుమంతరావు ప్రారంభించారు.అంబర్పేట్.. ప్లేగ్రౌండ్ నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేసిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.1960లో వీరస్వామి..రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, సద్గురు వీరస్వామి గౌడ్, సత్యనారాయణ గౌడ్, ధనుంజరు గౌడ్, జైహింద్ శ్రీకాంత్ గౌడ్,అరవింద్ గౌడ్,యాదగిరి భా ను ప్రకాశ్, రజినీకాంత్,అనిల్,శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.