Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితున్ని కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ సింగరేణికాలనీలో ఆరేండ్ల గిరిజన చిన్నారిపై లైంగికదాడి చేసి, హత్య చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేసింది. ఆదివారం ఈమేరకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్వెస్లీ, టి స్కైలాబ్బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.
మరియమ్మ కుటుంబానికి ఇచ్చినట్టుగానే బాలిక కుటుంబానికి కూడా రూ 50 లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు, గిరిజన బంధు వంటి పథకాలు వర్తింపజేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనీ, అమ్మాయి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.