Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం ఏఎస్పీని ఆశ్రయించిన బాధితులు
- ఇరువురు మేస్త్రీలపై కేసు నమోదు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో ఆదివాసీ మైనర్ వలస కూలీలపై లైంగికదాడి యత్నం జరిగిన సంఘటనపై ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని ఆదివాసీ గ్రామానికి చెందిన పలువురు ఇటీవల కూలి పనుల నిమిత్తం భద్రాచలం వచ్చారు. తాపీ మేస్త్రీల వద్ద ఇంటి నిర్మాణ పనుల్లో కూలీకి వెళ్తున్నారు. ప్రతి రోజు మాదిరిగానే శనివారం పనులకు వెళ్లిన సమయంలో కావాలనే సమయాన్ని ఆలస్యంచేసి కూలీలపైలైంగికదాడికి యత్నించి నట్టు బాధితులు చెబుతున్నారు. ఆదివారం వివిధ ఆదివాసీ సంఘాలు, స్థానిక నాయకుల సహకారంతో భద్రాచలం ఏఎస్పీ కార్యాలయానికి వచ్చిన బాధితులు ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
లైంగికదాడి యత్నానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని భద్రాచలం సీఐని ఏఏస్పీ ఆదేశించారు. అదే విధంగా భద్రాచ లం పట్టణంలో మైనర్లతో పనులు నిర్వహిస్తున్న విషయంపై పూర్తి స్థాయి లో విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ ఆదేశించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేస్త్రీలు ఆర్. కిషోర్, బీ. వీరేంద్రర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ టి.స్వామి తెలిపారు.