Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వక్రభాష్యం
- ముస్లిం వ్యతిరేక పోరాటంగా చిత్రీకరణ
- భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటం : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ విధానాలను ఎండ గట్టాలనీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ముస్లింలకు వ్యతిరేకంగా హిందూవులు చేసిన పోరాటంగా చిత్రీకరించేందుకు కుట్ర చేయడం తగదని సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీర భద్రం విమర్శించారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో 'నిజాం నిరంకుశ పాలన పై పోరాడిన కమ్యూనిస్టుల తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ' ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ దొరలకు, నైజాంకు వ్యతిరేకంగా తిరగబడ్డ వీరవనిత ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేడున్న పరిస్థితుల్లో ఎంతో అవసర మని వివరించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ చేస్తున్న కుయుక్తులు, కుట్రలను ఎండగట్టాలని చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వాళ్ల రాజకీయ స్వార్థం కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పోరాటాన్ని విమోచన దినంగా ప్రచారం చేస్తూ బీజేపీ మత రాజకీయాలకు తెరలేపుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం రాజునుదించడం కోసం హిందూవులుజరిపిన పోరా టంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తున్నారని విమర్శించారు. ఎన్నో త్యాగాలు చేసి, లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన ఆ పోరాటాన్ని, ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కిన ఆ పోరాటాన్ని ఎందుకు వక్రీకరించబూనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలన్నారు. మత వైషమ్యాలు పెంచ డం వల్ల బీజేపీ దేశంలో లాభపడుతున్నదనీ, అందు లో భాగంగానే ఇక్కడ కూడా చారిత్రాత్మక పోరాటాన్ని వక్రీకరించేదుకు కుట్ర చేస్తున్నదని చెప్పారు.
'ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తాం, దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తాం' అని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసు కోకుండా.. ఉండేందుకే వైషమ్యాలను సృష్టిస్తున్నదని చెప్పారు. బీజేపీ సిద్దాంతం...నియంతల సిద్ధాంతం అని చెప్పారు. మెజార్టీ మతాన్ని ఆధారం చేసుకుని మైనార్టీ మతాల మీద ద్వేషం రెచ్చగొట్టాలనేదానిపై దాని ఎదుగుదల ఆధారపడి ఉందన్నారు. ఇదే వారి నియంతృత్వ సిద్ధాంతమన్నారు. ఈ ఏడేండ్ల కాలంలో ప్రజా సంక్షేమం కోసం వారు తీసుకున్న నిర్ణయాలేం టో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చేసిన వాగ్దా నాలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రమాదాన్ని అడ్డుకోవ డంలో విఫలమైందని విమర్శించారు. అవకాశవాదం తో ఉంటుందని వివరించారు. లౌకిక ప్రజాస్వామిక విలువలను దెబ్బతీసే బీజేపీ విధానాలను తిప్పకొట్ట గలిగేవిధానం సీపీఐ(ఎం)కేఉందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలనీ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని ఉద్యమం జరుగుతుంటే ఏ మాత్రం పట్టించుకోని బీజేపీ సర్కార్ ప్రజలకు ఏదో చేస్తామని చెప్పడం హస్యాస్పదమని విమర్శిం చారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి లబ్దిపొం దాలని చూసే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ బండి సంజరు తన పాదయాత్ర సందర్భంగా హిందూ, ముస్లిం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో భూ పంపిణీ కోసం జరిగినది రైతాంగసాయుధ పోరాటమని చెప్పారు. వెట్టి చాకిరీ దోపిడికి వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించడం అన్యాయమ న్నారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంట్రల్ కమిటి కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్రావు, దశరథ, అరుణజ్యోతి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.