Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాపు కులాలన్నింటిని ఐక్యం చేసి త్వరలో కాపు గర్జనను నిర్వహిస్తున్నట్టు కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేష్నాయుడు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాపు యువసేన, కాపు నాడు, కాపు మహాసభల సంయుక్త ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరుకాపుల జేఏసీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వారికి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం లభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కాపు గర్జన సభలను ఏపీ, తెలంగాణల్లో నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామా గ్రామాన అంబేద్కర్, జ్యోతిబాపూలే, పెరియార్ రామస్వామి, శ్రీకష్ణ దేవరాయలు, సాహూమహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ ప్రత్యేకహౌదా, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం ఉద్యమిస్తామని రమేష్ నాయుడు వివరించారు.