Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పర్మినెంట్గా ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోతామంటే ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛందంగా ఏపీలో పనిచేస్తామని అక్టోబర్ 15 లోపు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగులకు విభాగాధిపతులు (హెచ్ఓడీ) నిరభ్యంతర సర్టిఫికెట్లు (ఎన్ఓసీ) ఇచ్చేయాలని చెప్పారు. విజిలెన్స్ విచారణలు, క్రమశిక్షణా చర్యల్లో ఉన్నవారి దరఖాస్తుల్ని మాత్రం పెండింగ్లో పెట్టాలని పేర్కొన్నారు. ఒకసారి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిపోయిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఈనెల 9వ తేదీన విడుదలైన ఈ ఆదేశాలను సోమవారం మీడియాకు విడుదల చేశారు. రిలీవ్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి టీఏ, డీఏలు చెల్లించేది లేదని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.