Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మత్స్యపారిశ్రామిక సహకార సంఘంలో ముదిరాజ్ కులస్తులకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహాసభ నాయకులు చిన్నంగి వెంకటేశ్ ముదిరాజ్, రావుల జగదీశ్వర్ ప్రసాద్, కాసాని వీరేష్, కరాటే రమేష్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ మత్స్య సహకార సంఘంలో మొత్తం 4,814 సోసైటీలు ఉన్నాయని అందులో ముదిరాజ్ సోసైటీలు 2,968 ఉన్నప్పటికీ తమకు ఈ ప్రభుత్వం సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని తెలిపారు.