Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 315 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. సోమవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమ వారం సాయంత్రం 5.30 గంటల వరకు 70,974 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వా స్పత్రుల్లో 66,800 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,174 మందికి పరీక్షలు నిర్వహిం చారు. మరో 1,705 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,253 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 318 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 75 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా జోగులాంబ గద్వాల, మెదక్, ములుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో ఆదివారంతో పోలిస్తే సోమవారం 21 జిల్లాల్లో కేసులు పెరిగాయి.