Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలో ఇటీవల మరణించిన కాంట్రాక్టు అధ్యాపకుడు గణేష్చారి ఆత్మహత్యకు సంతాపంగా సోమవారం హైదరాబాద్లోని ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద టిప్స్, టిగ్లా, అతిధి అధ్యాపకుల సంఘం (2152) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని కోరారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. తాము అండగా ఉంటామనీ, వేతన బకాయిలు విడుదల చేయించేందుకు, ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొనసాగించేందుకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు వస్కుల శ్రీనివాస్, గణేష్, రవీందర్, అతిధి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, నాయకులు కె మహేశ్కుమార్, ప్రసాద్, యుగంధర్, రాంచంద్రం, అరుణ్కుమార్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.