Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి చైర్మెన్కు టీజీసీజీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీలన్నింటికీ కామన్ అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని సోమవారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షులు ఎ సంజీవయ్య, ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ మూల్యాంకనాన్ని అన్ని వర్సిటీల్లోనూ అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎన్ గోపి, రామకృష్ణారెడ్డి, రాజారెడ్డి, సత్యనారాయణ, ఏ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.