Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేసిన పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు, ఒకేషనల్ (క్రాఫ్ట్, ఆర్ట్) టీచర్లు, ఆదర్శ స్కూళ్లలో పనిచేసిన ఫిజికల్ డైరెక్టర్లు, ఒకేషనల్ టీచర్లు, అవర్లీ బేస్డ్ టీచర్లందరినీ వెంటనే పునర్నియమించాలని పీఆర్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కె రఘోత్తంరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఒకేషనల్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్ల స్థానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఆదర్శ పాఠశాలల్లో కేజీబీవీ టీచర్లకు డిప్యూటేషన్లు ఇవ్వడం సరైంది కాదని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అవసరం మేరకు విద్యావాలంటీర్లను నియమించాలని సూచించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.