Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా నేషనల్ వాటర్ మిషన్ కింద పురస్కారాలను అందజేస్తున్నది. 2020 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ స్టేట్ అవార్డ్ కోసం మార్చి నెలలో నామినేషన్ దాఖలు చేసింది. అవార్డు కోసం జల శక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన అన్ని అంశాలను వివరిస్తూ, ధ్రువీకరణ పత్రాలను జత చేసి నామినేషన్ దాఖలు చేసింది. దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించి 6 రాష్ట్రాలను చివరి దశ పరిశీలనకు కేంద్రం ఎంపిక చేసింది. తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు చివరి దశ పరిశీలను ఎంపికైనట్టు జల శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.