Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏడున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ దళితులు, గిరిజనులను దగా చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో సోమవారం టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ చట్టాలను, ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేసి ఉంటే ఆయా వర్గాలు ఎక్కు వగా లబ్ది పొంది ఉండేవన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు సరిగ్గా అమలై ఉంటే మేలు జరిగేదని తెలిపారు.