Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఐదు రోజులు మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందనీ, ఉత్తరకోసా ఒడిశాకి పశ్చిమ వాయువ్వ దిశలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఈ వాయుగుండం రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్మీదుగా ప్రయాణించే అవకాశముందనీ, అది క్రమంగా బలహీనపడుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ మీదుగా పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఐదురోజులు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందనీ, జీహెచ్ఎంసీ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. కొమ్రం భీమ్ జిల్లా కాగజ్నగర్లో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.