Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల భద్రత కోసం రాష్ట్రంలో పోలీసుశాఖతో పాటు ఇతర విభాగాలతో తెలంగాణ మహిళా కమిషన్ సమన్వయంచేసుకోవాలని పార్లమెంట్ సభ్యురాలు డా. హీనా విజరు కుమార్ గవిత్ పేర్కొన్నారు. ఆమె అధ్యక్షతన ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మహిళా సాధికారతపై రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఈసందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్తో సోమవారం గవిత సమావేశం నిర్వహించారు. మహిళా కమిషన్ మహిళ భద్రతకు తీసుకుంటున్న చర్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గృహ హింసకేసులు, పని ప్రదేశాల్లో వేధింపులు, లైంగికదాడి, హత్యలు, ఫోక్సో కేసులను త్వరగా పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈసందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలను కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. మహిళా కమిషన్తో పాటు, డబ్ల్యూసీడీ, ఎస్సీ వివిధ షెల్టర్ హోంలలో అందిస్తున్న సేవలు, సఖి కేంద్రాల నిర్వహణ, పనితీరును ఆమె వివరించారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా కమిషన్ కొన్ని సిఫార్సులను పార్లమెంటరీ కమిటీకి సమర్పించారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులు, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు షహీద్ అఫ్రోజ్, కె. ఈశ్వరీబాయి , కె. ఉమాదేవియాదవ్, గద్దల పద్మ, సుధమ్ లక్ష్మి, కె. రేవతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర మహిళా కమిషన్ చేస్తున్న ప్రయత్నాలను పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది.