Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 13 నెలల చిన్నారి అదృ శ్యం, హత్య కలకలం రేపింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు రంగస్వామి, సుమలత హైదరాబాద్ నగరంలో చెత్త ఆటోను నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మియాపూర్ మెట్రోస్టేషన్కి ఆనుకొని ఉన్న ఓంకార్ నగర్లో వారు నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తమ కూతురు ఇంటి బయట ఆడుకుంటుందని తల్లి ఇంట్లోకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూసేసరికిి కూతురు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. రాత్రంతా బస్తీవాసులు ఎంతగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు నివసిస్తున్న గుడిసె పక్కనే చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. బాలికపై ఏమైనా అఘాయిత్యం జరిగిందా? లేక.. ఎవరైనా పాతకక్షలతో చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.