Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నూతన చైర్మెన్లను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నియమించింది. ఈ మేరకు కేంద్ర కార్యదర్శి ఎ.కె.దాస్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. సీడబ్ల్యూసీ హెడ్ క్వార్టర్ ఛీఫ్ ఇంజినీర్ డాక్టర్ ఎం.కె.సిన్హా, సీడబ్ల్యూసీ (వైబీఓ) ఛీఫ్ ఇంజినీర్ జి.కె.అగర్వాల్ జీఆర్ఎంబీ చైర్మెన్లుగా, సీడబ్ల్యూసీ (సీ అండ్ ఎస్ఆర్ఓ) కోయంబత్తూర్ ఛీఫ్ ఇంజినీర్ టి.కె.శివరాజన్, యూజీబీఓ (లక్నో) చీఫ్్ ఇంజినీర్ అనుపమ్ ప్రసాద్ కేఆర్ఎంబీ చైర్మెన్లుగా నియమితులయ్యారు.