Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్
- తెలంగాణ సాయుధ పోరాట యోధుల నిజమైన వారసులు.. కమ్యూనిస్టులే..: సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు జి. నాగయ్య
నవతెలంగాణ-మద్దూరు, చేర్యాల
నిజాం రజాకార్లను తరిమికొట్టిన భైరాన్పల్లి సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం భైరాన్పల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బురుజు వద్ద నివాళులు అర్పించి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు చేర్యాల మండల కేంద్రం నుంచి భైరాన్పల్లి సంస్మరణ సభకు బయల్దేరిన బైక్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయ కులు కామ్రేడ్ కమలాపురం జయరాములు స్థూపాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం దూల్మిట్ట సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సుంచు విజేందర్ అధ్యక్షతన భైరాన్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగయ్య మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బైరాన్పల్లి గ్రామానికి చెందిన 96 మంది, కూటిగల్ గ్రామానికి చెందిన 15 మందిని ఒకేసారి వరుసలో నిలబెట్టి ప్రాణాలు బలి గొన్నారన్నారు. ఈ క్రమంలో నైజాం మూఖలను ఎదిరించ డానికి ప్రతి గ్రామంలో గెరిల్లా గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసి నిజం రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూ నిస్టులదని తెలిపారు. సాయుధ పోరాట సమయంలో పత్తా లేని బీజేపీ.. ఇప్పుడు ముస్లింలను తరిమికొట్టి హిందువులకు విముక్తి చేయడం తెలంగాణ సాయుధ పోరాటంగా వక్రీకరి స్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిజాం రజాకార్లను గొప్ప వ్యక్తులుగా చెప్పడం సిగ్గుచేటన్నారు. కోకాపేటలో ఉన్న దళితుల భూములను అమ్మి.. దళితబంధు పథకం తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. మోసపూరిత ప్రభు త్వాన్ని ప్రజలు పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరు లకు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పిండ ప్రదానం చేయడం.. వారిని అవమాన పరిచిన ట్టేనని అన్నారు. బైరాన్పల్లి పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలనీ, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి కళావతి, రాళ్ళబండి శశిధర్, సందనబోయిన ఎల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు నక్కల యాదవ రెడ్డి, మద్దూరు, చేర్యాల మండల కార్యదర్శులు ఆలేటి యాదగిరి, కొంగరి వెంకట్ మావో, సర్పంచులు బండి శ్రీనివాస్ గౌడ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.