Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిని సంక్షోభం దిశగా తీసుకెళ్లి అమ్ముకునే ప్రమాదం
- ప్రతిఘటించకపోతే కార్మికుల బతుకులు ఆగం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
- ప్రారంభమైన సింగరేణి కార్మిక పోరుయాత్ర
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
లాభాల బాటలో నడుస్తున్న సిం గరేణి వంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివే టీకరణ విధానాల కారణంగా తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముం దని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని, సింగరేణిని కూడా సంక్షోభం దిశగా తీసుకెళ్లి ప్రయివేట్కు అప్పగించే ప్రయత్నం చేస్తోం దని తెలిపారు. కార్మికులు చైతన్యవంతులై పోరాటం వైపు నడవాలని పిలుపునిచ్చారు. లేదంటే బతుకులు అంధకారమయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ అనుబంధ సింగరేణి కాల రీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎస్సీఈయూ), సింగరేణి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎస్ సీకేయూ) ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక పోరు యాత్రకు సోమవారం శ్రీకారం చుట్టారు. కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గని వద్ద యాత్ర(జీపు జాతా)ను సాయిబాబు ప్రారంభించారు. అక్కడి నుం చి బెల్లంపల్లి, మందమర్రి వరకు సాగింది. కార్మికులు ఘనస్వాగతం పలికారు. మందమర్రి కళ్యాణికని గని వద్ద కార్మికులనుద్దేశించి సాయిబాబు మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ఆజాదికా అమృత్ మహో త్సవ్ పేరిట ఉత్సవాలు జరుపుతూ.. మరో వైపు ప్రభుత్వరంగ సంస్థలను నేషనల్ మానిటైజేషన్ పేరి ట అమ్మకానికి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కార్మికులు కష్టపడి సాధించిన ప్రజా సంపదను అప్పనంగా అమ్మేస్తోందన్నారు. బొగ్గు బావులు, రైల్వే, విమానాలు, ఓడరేవులు, టెలికం టవర్లు, గ్యాస్ పైప్లైన్లు, స్టేడియాలను ప్రయివేట్పరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలైన అంబానీ, ఆదానీ వంటి పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరతరాలకు ఉపయోగపడే సంపద ను బీజేపీ ప్రభుత్వం కండ్ల ముందే అమ్ముతుంటే సీఎం కేసీఆర్ అడ్డుపడటం లేదని విమర్శించారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనం కోసం స్థలం అడగటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ కు ఇస్తామన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ గురించి సీఎం పట్టించుకోవడం లేద న్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం డివైడెంట్ రూపం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లాభాలు పంపిస్తోం దని తెలిపారు. కానీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12వేల కోట్లను ఇవ్వడం లేదని తెలిపారు. జైపూర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ బకాయిలు కూడా చెల్లించడం లేదని చెప్పారు.
రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థను సంక్షోభం దిశగా తీసుకెళ్లి ప్రయివేట్కు అప్పగించే ప్రమాదముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికుల హక్కులను కాలరాస్తోందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలుగా మారాయన్నారు. రాబోయే రోజుల్లో పర్మినెంట్ కార్మికులకు కూడా జీతాలురాని పరిస్థితి వస్తుందన్నారు. గతంలో సింగరేణిలో 1.40లక్షల మంది కార్మికులు పనిచేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య 44వేలకు పడిపోయిన విషయం గమనించాలన్నారు. కార్మికులు ఇప్పుడే మేల్కొని పోరాటం దిశగా అడుగులు వేయాలని సూచించారు. సీఐటీయూ కార్మికుల పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రాజారెడ్డి, మంద నరసింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.నాగరాజ్గోపాల్, ఎస్సీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, ఎస్సీఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శి ఆర్.రామస్వామి, రీజనల్ కార్యదర్శి గుల్ల బాలాజీ, కుమురం భీం జిల్లా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు లోకేష్, ముంజం శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సంకె రవి, ఎస్సీఈయూ మందమర్రి ఏరియా కార్యదర్శి రాజేందర్, బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి అంబాల ఓదేలు పాల్గొన్నారు.