Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సామాజిక వివక్షను బద్ధలు కొడతాం : సీఎం కేసీఆర్
- 'నాలుగు మండలాల్లో దళిత బంధు పథకం'పై ఉన్నతస్థాయి సమీక్ష
- అధికారులకు పలు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసి, వారిని వ్యాపారవర్గంగా నిలబెట్టి, తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బద్ధలు కొడతామని ఆయన తెలిపారు. ఒక అత్యున్నత ఆశయం, సామాజిక బాధ్యత, నిర్దిష్టమైన లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చామని ఆయన వివరించారు. హుజూరాబాద్, వాసాలమర్రితో సహా మధిర నియోజకవర్గంలో చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలాల్లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా చేపడుతు న్నామని సీఎం తెలిపారు. ఈ నాలుగు మండలాలకు కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన, ఆ నాలుగు మండ లాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి అత్యున్న త స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మెన్లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసిఆర్ మాట్లాడుతూ... స్వ రాష్ట్రంలో అనేక రంగాల్లో దేశం గర్వించదగ్గ అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించామని చెప్పారు. ఇదే ఉద్యమ స్పూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. ఏదైనా ఒక్కరోజుతోనే సాధ్యం కాదనీ, దశలవారీగా విజయాన్ని చేరుకుంటామని చెప్పారు. ఇదే క్రమంలో దశలవారిగా బడ్జెట్లో నిధులు కేటాయించుకుని ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.
పేరంటల్ అప్రోచ్ ఉండాలె...
దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరంటల్ అప్రోచ్ తో పనిచేయాలని సీఎం అన్నారు.ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వివక్షకు గురవుతూ వెనుకబడిన దళితులను దళితబంధు పథకం ద్వారా తల్లిదండ్రుల్లాగా వారు ఆదుకోవాలని కోరారు. విద్యావంతులైన దళిత యువకులు తమ భూజాలమీద ఈ పథకాన్ని మోయాలని సూచించారు. అందుకనుగుణంగా వారిని ఈ పథకంలో భాగాస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఈ పథకంలొ సపొర్టు స్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామనీ, ఇందుకోసం రక్షణ నిధిని కూడా సిద్ధం చేశామని వివరించారు.
వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు...
ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్లు కల్పించ నున్నట్టు సీఎం ఈసందర్భంగాచెప్పారు. మెడికల్, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్డీలర్షిప్పులు, ట్రాన్స్ పోర్టు పర్మిట్లు, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు, బార్లు, వైన్ షాపులు తదితర రం గాలద్వారా వారు ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.
దళితబంధు పథకం అమలు, అందుకు అనుసరించాల్సిన పద్ధతులు, విధి విధానాలు గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. మొదటిదశలో పథకం అమలు పటిష్టంగా జరగాలని ఆయన వారికి సూచించారు. రెండో దశలో పథకం పర్యవేక్షణ కీలకమన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి లబ్దిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబందు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామం, మండలం, నియోజక వర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో దళితబంధు కమిటీలు ఉంటా యని అన్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నికైన వారే రీసోర్స పర్సన్లుగా పనిచేస్తారన్నారు. పథకాలను ఎంచుకునే క్రమం లో పునరావృతం కాకుండా, లాభసాటిగా ఉండేలా చూసుకో వాలని కోరారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విస్మరించబోదనీ, బ్రాహ్మణులు తదితర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారికోసం కూడా పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు హుజూరాబాద్లో దళితబంధు అమలు తీరు తెన్నులను కరీంనగర్ కలెక్టర్ కణ్నన్ వివరించారు. దళిత బంధు కింద డెయిరీ యూనిట్లు నెలకొల్పేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దళిత అభివృద్ధి, పశుసంవర్థక, సహకార డెయిరీలతో ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.