Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూసీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? అని ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంగళవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మల్లేశంతో కలిసి జీవన్రెడ్డి మాట్లాడారు. బండి సంజరుకు నిజంగా రాష్ట్ర రైతాంగంపట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి రూ.20 వేల కోట్లు తెచ్చి, ఇక్కడి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో చైత్రపై అఘాయిత్యం జరగటం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. అయితే ప్రతీ విషయానికి సీఎం రావాల్సిన అవసరం లేదనీ, జిల్లా కలెక్టర్తో మాట్లాడటం ద్వారా ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు.