Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం గతనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన లాసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ జిబి రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. మూడేండ్ల లా కోర్సుకు 28,904 మంది, ఐదేండ్ల లా కోర్సుకు 7,676 మంది, పీజీ లా కోర్సుకు 3,286 మంది కలిపి మొత్తం 39,813 మంది దరఖాస్తు చేశారనీ, వారిలో 29,629 (74 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని వివరించారు.