Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒయాసిస్ ఫెర్టిలిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంతాన సాఫల్య కేంద్రం ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ ఏడాది కొత్తగా 11 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గాదెలా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే మూడేండ్లలో దేశవ్యాప్తంగా 50 కేంద్రాలతో తమ నెట్వర్క్ను రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించారు. నాణ్యమైన ఆధునాతన వైద్యంతో సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులకు కుటుంబం అనే అద్భుత బంధాన్ని అనుభవించేలా చేయటమే లక్ష్యంగా విస్తరణ చేపట్టామని తెలిపారు. ఇప్పటికే 35 వేల మందికి పైగా కుటుంబాలకు సేవలందించామని పేర్కొన్నారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయశ్రేణి నగరాల్లో తమ సేవలు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.