Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిమ్లాలో 1921 సెప్టెంబర్ 15న జరిగిన మొదటి ''ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్'' జరిగి 100 సంవత్సరాలైన సందర్భంగా బుధవారం 81వ ''ఆల్ ఇండియా అసెంబ్లీ స్పీకర్లు మరియు కౌన్సిల్ చైర్మన్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.'' జరుగుతుంది. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ అధ్యక్ష వహిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్తో పాటు దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మెన్లు పాల్గొంటారు. ఈసందర్భంగా రాజ్యసభ, లోక్ సభ టీవీలను కలిపి ''సంసద్'' టీవీగా మార్చి ప్రసారాలను ప్రారంభిస్తారు. రాష్ట్రం నుంచి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మెన్ వి. భూపాల్ రెడ్డి , అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ శాసనసభనుంచి వర్చువల్ విధానం ద్వారా సమావేశంలో పాల్గొంటారని లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.