Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో పొందిన బెయిల్ను రద్దు చేయాలన్న తన పిటిషన్ను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ కె రఘురామకష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో బుధవారం ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి కె లక్ష్మణ్ వెల్లడించారు. అక్రమాస్తుల కేసులోని రెండో నిందితుడు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పి అక్కడి పిటిషన్ను బదిలీ చేయాలని ఎలా కోరతారని హైకోర్టు ప్రశ్నించింది. విజయసాయిరెడ్డి బెయిల్నూ రద్దు చేయాలనీ, సీబీఐ కోర్టులో కేసు వేశామనీ, దీనిపై 15న తీర్పు రానుందని రఘురామకృష్ణంరాజు న్యాయవాది చెప్పారు. ఎంతోమంది నిందితులు విదేశాలకు వెళ్లేందుకు తాము ఉత్తర్వులు ఇచ్చామని చెప్పింది. ఈ తరహా పిటిషన్లను అనుమతించొద్దని సీబీఐ కోరింది.
బీసీ కమిషన్కు స్టే ఇచ్చే అధికారం లేదు
ఇఫ్లూలో పలు పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్పై జాతీయ బీసీ కమిషన్ స్టే ఇవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. బీసీ కమిషన్ ఏమీ కోర్టు కాదని చెప్పింది. 1996లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు కమిషన్కు స్టే, ఇంజక్షన్ ఆర్డర్ వంటివి జారీ చేసే అధికారం లేదని వివరించింది.కమిషన్ నిర్ణయాన్ని ఇఫ్లూ సవాల్చేసిన రిట్ను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచం దర్రావు, జస్టిస్ టి వినోద్కుమార్ల డివిజన్ బెంచ్ విచారించింది.స్టే ఇచ్చే అధికారం ఉందని బీసీ కమిషన్ చెప్పింది.కమిషన్ తనకు లేని అధికారా లతో కోర్టు తరహాలో ఆర్డర్ ఇచ్చే అధికారం లేదని ఇఫ్లూ వాదించింది. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు స్పష్టం చేసింది.
పుప్పాలగూడ భూవివాదం కేసు 16కు వాయిదా
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, పుప్పాలగూడలో 18 ఎకరాల భూమి హక్కుల వివాదం కేసు విచారణ ఈనెల 16కి వాయిదా పడింది. సర్వే నెం.301, 303, 327ల్లోని 18 ఎకరాల భూమిని వేలాన్ని అక్టోబర్ నెలాఖరు వరకూ వాయిదా వేసేందుకు ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి వినోద్కుమార్ల ధర్మాసనం మంగళవారం ఆదేశాలను జారీ చేసింది. భూమిపై అన్ని హక్కులూ ప్రభుత్వానికే ఉన్నాయనీ, పలు పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసిందని ఏజీ బిఎస్ ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వ వివరణ కోసం విచారణ 16కి వాయిదా వేసింది.