Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు సిటీ కాలేజీలో...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ యాకూబ్... 'సిటీ కాలేజీ మఖ్దూం మొహియుద్దీన్ నేషనల్ అవార్డు...'కు ఎంపికైన నేపథ్యంలో, ఆ అవార్డును గురువారం ప్రదానం చేయనున్నారు.
నగరంలోని సిటీ కాలేజీ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు అవార్డు ప్రదానోత్సవ సభ జరగనుంది. సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్, సుప్రసిద్ధ సాహితీవేత్త కె.శివారెడ్డి, ప్రముఖ సినీ దర్శకులు ఎన్.శంకర్ తదితరులు పాల్గొంటారు. అవార్డు కమిటీ ప్రతినిధులు డాక్టర్ విప్లవదత్ శుక్లా, డాక్టర్ కోయి కోటేశ్వరరావు సభను నిర్వహిస్తారు.