Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పసిపాప చైత్రబాయి పై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కెేవీపీఎస్్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కెేవీపీఎస్ ప్రతినిధి బందం హైదరాబాద్ సింగరేణి కాలనీలో చైత్ర తల్లితండ్రులు సభావాట్ జ్యోతి, రాజు లను కలిసి ఓదార్చింది. చైత్ర చిత్రపటానికి స్కైలాబ్ బాబు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నాయకులు దశరధ్, యాదగిరి, పవన్ పూలమాల వేసి నివాళులర్పించారుఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల చిన్నారిపై ఇంటి పక్కనే ఉంటున్న ఓ వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడి చేసి గొంతు నులిమి చంపేయటం ధారుణమని అన్నారు. రోజురోజుకు మహిళలు, విద్యార్థినిలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయనీ, వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని కోరారు. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రిలేదీక్షలుచేస్తున్న గిరిజన సంఘాల నాయకులను అభినందించారు దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బి భిక్షపతి, సి హెచ్ గంగారాం, ఎం రవి లతోపాటు గ్లోబల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొప్రయిటర్ సలిపేల రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.