Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండు తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని మంగళవారం ప్రకటించారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366, 9490616627 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే 10బృందాలను రంగంలోకి దించారు.నాలుగు రోజులుగా కోసం గాలిస్తున్నారు. అయినా నిందితుడు రాజు ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన ఆనవాళ్లతో పోలీసులు రివార్డు ప్రకటించారు. 30ఏండ్ల రాజు 5.9ఎత్తు, పొడువైన జుట్టు ఉందని, టీషర్టు, ఫార్మల్ ప్యాట్ వేసుకు ంటాడని తెలిపారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని, మద్యానికి బానిసగా మారిన రాజు బస్టాండ్లలో నిద్రిస్తాడని ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.