Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంఈకి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బకాయిపడ్డ మూడు నెలల వేతనాలను తమకు ఇప్పించాలని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అవుట్ స్టాఫ్ సోర్సింగ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ ప్రతినిధులు శివకుమార్, వెంకన్న, శైలజ, అశ్వినీ, సునీత రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్రెడ్డికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జీవో 900 ప్రకారం నియామకమైన తమకు ఈ ఏడాది మే, జూన్, జులైకి సంబంధించిన వేతనాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. చిరుద్యోగులమైన తమ సమస్యలను అర్థం చేసుకుని వెంటనే వేతనాలను ఇప్పించాలని విన్నవించారు.
డిఎంఈ నిర్లక్ష్యంతోనే : గోవర్థన్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్రెడ్డి నిర్లక్ష్యంతోనే వేతనాలు ఆలస్యమవుతున్నాయని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు కురుమేటి గోవర్థన్ విమర్శించారు. తక్షణమే వేతనాలు విడుదల చేయాలనీ, లేనిపక్షంలో ఆందోళనే చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.