Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్రువపత్రాల పరిశీలనకు 71,186 మంది హాజరు
- వెబ్ఆప్షన్ల నమోదుకు రేపే ఆఖరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు 66,290 అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు 71,186 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 47,471 మంది వెబ్ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. వెబ్ఆప్షన్ల నమోదుకు గురువారం వరకే గడువుందని వివరించారు. 45 ఇంజినీరింగ్ కోర్సుల్లో 66,290 సీట్లు, బీఫార్మసీలో 3.220 సీట్లు, ఫార్మాడీలో 520 సీట్లు కలిపి 70,030 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో సీఎస్ఈలో 16,801 సీట్లు, ఈసీఈలో 12,582 సీట్లు, ఈఈఈలో 6,366 సీట్లు, సివిల్ ఇంజినీరింగ్లో 5,766 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్లో 5,355 సీట్లు, సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్)లో 5,037 సీట్లు, ఐటీలో 4,713 సీట్లు, సీఎస్ఈ (డేటాసైన్స్)లో 3,003 సీట్లు, సీఎస్ఈ (సైబర్ సెక్యూరిటీ)లో 1,638 సీట్లు, సీఎస్ఈ (ఐవోటీ)లో 1,029 సీట్లు ఇలా వివిధ కోర్సులున్నాయని వివరించారు. అభ్యర్థులు ఎక్కువ వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు.