Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.18,000లుగా నిర్ణయించిన జీవోలు వెంటనే గెజిట్ చేయాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వి రమ
నవతెలంగాణ-గజ్వేల్
కార్మికుల హక్కులను కాలరాసేలా.. కేంద్రం తెచ్చిన కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమ డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 18,000లుగా నిర్ణయించి పెండింగ్లో పెట్టిన జీఓలను వెంటనే గెజిట్ చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన గజ్వేల్ ఇండిస్టియల్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో రమ పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులకు నష్టం కలిగించే విధంగా నూతనంగా చట్టాలు తయారు చేసిందనీ, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల యజమానుల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్లను ప్రభుత్వం రూపొందించిందనీ, వాటి వల్ల కార్మికుల భద్రతకే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ప్రకారం కనీస వేతనం రూ.21,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్మిక గర్జనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కోశాధికారి కళావతి, సహాయ కార్యదర్శి బండ్లస్వామి, రంగారెడ్డి, బాల్లక్ష్మి, రాజు , నర్సింలు, నాగ రాజు, బిక్షపతి, స్వామి, కనుకయ్య, నగేష్ కిషన్ కుమార్ పాల్గొన్నారు.