Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, నర్సింహారావు
- రెండోరోజు కొనసాగిన కార్మిక పోరుయాత్ర
నవతెలంగాణ-జైపూర్
ఏటేటా లాభాలు ఆర్జిస్తున్న సింగరేణికి ముంపు ముంచుకొస్తోందని.. దానిని కార్మికులే కాపాడుకోవాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి, వేజ్బోర్డు సభ్యులు, ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని చైతన్యపర్చడం కోసం సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎస్సీఈయూ), కాంట్రాక్టు కార్మిక సంఘం (ఎస్సీకేఎస్) చేపట్టిన కార్మిక పోరుయాత్ర మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్లో సాగింది. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి రాజారెడ్డి, నర్సింహారావు మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మికులే ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మికులు లాభాలు అర్జించి పెడుతుంటే సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి దోచిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి కార్మికవర్గం చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లాభాలు అర్జిస్తున్న సింగరేణిలో.. కార్మికుల జీతభత్యాల కోసం అధి కారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఉందో గమనించాలన్నారు. ఆర్థికంగా ఆదు కోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సంస్థను నిర్వీర్యం చేస్తోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడు దారులకు 500 బొగ్గు బ్లాకులను ధారాదత్తం చేసేందకు కేంద్ర ప్రభుత్వం తీర్మానించుకుంద న్నారు. బొగ్గు రంగంలో ఉన్న 160 బొగ్గు బావులను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించి రూ.32వేల కోట్లు సమకూర్చుకోవడం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి.. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. సింగరేణిలో కార్మికులకు కేటా యించిన క్వార్టర్లను వారికే సొంతం చేయాలన్నారు.
పోరుయాత్రకు మున్సిపల్ కార్మిక సంఘం మద్దతు
కార్మిక పోరుయాత్రకు మందమర్రి మున్సిపాలిటీ కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. గోలేటి నుంచి బయలుదేరి మందమర్రికి చేరుకున్న పోరు యాత్రలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కాసర్ల రాజలింగు, నర్సయ్య, చిలుముల వెంకమ్మ, సాగే పోశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి, సింగరేణి యూనియన్ డిప్యూటీ కార్యదర్శి నాగరాజుగోపాల్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంకె రవి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.