Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లో 103ఏండ్ల కింద నిర్మించిన ఉస్మా నియా ఆస్పత్రి పాత భవనాన్ని కూల్చొద్దనీ, దాన్ని చారిత్రక కట్టడంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా పాతభవన ఎదుట ''పట్నం'' ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహిం చారు. 'ఉస్మానియా పాత భవానాన్ని కూల్చొద్దు చారి త్రక కట్టడంగా మార్చాలి' అని కార్యకర్తలు నినాదా లు చేశారు. నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఏడెకరాల ఖాళీ స్థలంలో బహుళంతస్తుల భవనాన్ని కట్టించి అందు లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రికి వస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందనే నమ్మకం రాష్ట్రంలోని పేదలకు నేటికీ ఉందన్నారు. ఇలాంటి ఆస్పత్రి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా మీనమేషా లు లెక్క పెట్టడం సరిగాదన్నారు. గతేడాది ఉస్మాని యా పాత భవనాన్ని సందర్శించాననీ, చిన్నచిన్న మరమ్మతులు చేస్తే అది మరో వందేండ్లయినా చెక్కుచెదరకుండా ఉంటుందని చెప్పారు. ఆ బిల్డింగ్లో మెడికల్ రీసెర్చ్ సెంటర్నుగానీ, మ్యూజియాన్నిగానీ కొనసాగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర మంత్రివర్గం వెంటనే కూర్చోని ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ పాత భవనాన్ని చారిత్రక కట్టడంగా గుర్తిస్తూ తీర్మానం చేయాలని కోరారు. 'పట్నం' రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు మాట్లాడుతూ..హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు పేదలకు సేవలు అందించడంలో ముందు వరుసలో ఉన్నాయన్నారు. ఉస్మానియాకు అనుబంధంగానే నిలోఫర్, ఎమ్ఎన్జీ క్యాన్సర్, మలేరియా నివారణ, ఇలా అనేక ప్రత్యేక ఆస్పత్రులు పుట్టుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఉస్మానియా పాతబిల్డింగ్కు ఘన చరిత్ర ఉందనీ, దాన్ని కూల్చేసి చరిత్రను నేలమట్టం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పాత భవనాన్ని చారిత్రక కట్టడంగా గుర్తించాలనే విషయంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నదన్నారు. హైకోర్టులోనూ పిల్ వేస్తా మని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహణ విష యంలో చేతగాకపోతే సాలార్జంగ్ మ్యూజియం నిర్వాహకులకు దాన్ని అప్పగించాలన్నారు. పాతభవ నాన్ని మెడికల్ మ్యూజియంగా మార్చాలని కోరారు. కేరళలో జిల్లాకో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఉందనీ, అదే తరహాలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అం దించేందుకు మన రాష్ట్రంలోనూ ఆస్పత్రులను నిర్మిం చాలని డిమాండ్ చేశారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ మాట్లాడుతూ..ఉస్మానియా ఆస్ప jత్రిని పోలీసులు, ప్రయివేటువాళ్లు పార్కింగ్ స్థలంగా వాడుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఆస్పత్రికి నేటికీ మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి పేద ప్రజలు వైద్య సేవల కోసం వస్తున్నారనీ, అలాంటి ఆస్పత్రిని కూల్చానుకోవడం తగదన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం పరిరక్షణ కోసం భవిష్య త్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. మెడికల్ సేల్ అండ్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్, పట్నం రాష్ట్ర నాయకులు కేవీఎస్ఎన్ రాజు, వీఎవీఎస్ ప్రసాద్, మారన్న, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు అంజయ్య, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కార్యదర్శి రాజేశం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావిద్, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కృష్ణనాయక్, ఐద్వానాయకులు శశికళ, మీనాకుమారి, అరుణ జ్యోతి, సీఐటీయూ నాయకులు నాగేశ్వర్, బీడీఎల్ నాయకులు మురళి, సత్తయ్య పాల్గొన్నారు.