Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే కోవిడ్ మెగా వ్యాక్సినేషన్లో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మెన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థల కార్యకర్తలు భాగస్వాములై జయప్రదం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ఉన్నతాధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జెడ్పీ చైర్మెన్లు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రతిరోజూ 3 లక్షల మందికి టీకాలు వేయాలనే ఉద్దేశంతోనే వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ను తలపెట్టామన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 17 వేల మందికి టీకాలు వేశామనీ, అందులో 55 లక్షల మందికి సెకండ్ డోస్ కూడా పూర్తయిందని తెలిపారు. ఇంకా వ్యాక్సిన్ వేయించుకునేందుకు 18 ఏండ్లకుపైబడినవారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని తెలిపారు.