Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చట్టసభల్లో చోటు చేసుకుంటున్న అసంబద్ధ చర్చలను సరి చేయాలనీ, సభ్యులు బయటి రాజకీయాలను ప్రస్తావించకుండా కేవలం ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు మాత్రమే అనుమతివ్వాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన ''81వ ఆల్ ఇండియా అసెంబ్లీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ల కాన్ఫరెన్స్ '' లో హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ రూమ్ నుంచి పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో శాసనసభ అత్యంత ఉన్నతమైన సభలనీ, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత చట్టసభల సభ్యులతో పాటుగా ప్రతి ఒక్కరిపైన ఉందని అభిప్రాయపడ్డారు.
నూతన ఎక్సైజ్ విధానంపై మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష
నూతన ఎక్సైజ్ విధానంపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో భేటి అయ్యారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై చర్చించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీతో బార్ లైసెన్సు గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2021 - 22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్కు సంబంధించిన అంశాలపై మంత్రి ప్రధానంగా సమీక్షించారు.