Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు గురువారం వరకు గడువున్నది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 58,355 మంది వెబ్ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. అభ్యర్థులందరూ 25,30,326 ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. ఒక అభ్యర్థి 1,186 వెబ్ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు. అభ్యర్థులు ఎక్కువ ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు.