Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి,ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్స్ను రద్దు చేయాలనే పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి నుంచి మరో కోర్టుకు బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అక్రమాస్తుల కేసులో పొందిన బెయిల్ను రద్దు చేయాలన్న తన పిటిషన్ను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ కె.రఘురామకష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో బుధవారం న్యాయమూర్తి కె.లక్ష్మణ్ తీర్పు చెప్పారు. రిట్ను కొట్టేస్తున్నట్టు ప్రకటించారు. అక్రమాస్తుల కేసులోని రెండో నిందితుడు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పి అక్కడికి పిటిషన్ను బదిలీ చేయాలని కోరడం సరికాదని కోర్టు తేల్చింది. కేసు బదిలీ చేసేందుకు కోరడానికి తగిన కారణాలు చూపలేదని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం కేసు వేసినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది.