Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలాఖరులోగా మరో కోటి మందికి టీకా: సీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రెండు కోట్ల కరోనా టీకాల పంపిణీ పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన
బీఆర్కె భవన్లో ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రెండు కోట్ల టీకాల లక్ష్యాన్ని చేరుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సంబంధిత శాఖ అధికారులు, వైద్యసిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా మరో కోటి డోసుల మేర వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన 52 శాతం మందికి మొదడి డోసు వేశామనీ, జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు అందరికి మొదటి డోసు అందిందని వెల్లడించారు.