Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం హైదరాబాద్లో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీలు కె జనార్ధన్రెడ్డి, కె రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. బడుల హేతుబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని కోరారు. పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు, ఒకేషనల్ టీచర్లు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, అవర్లీ బేస్డ్ టీచర్లను పునర్నియామకం చేయాలని సూచించారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీ ఉపాధ్యాయులను డిప్యూటేషన్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం అనుమతులను వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రి సబిత సానుకూలంగా స్పందించారని తెలిపారు.