Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి బుధవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39,805 మంది దరఖాస్తు చేయగా, 29,629 మంది పరీక్ష రాశారని వివరించారు. వారిలో 20,398 (68.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 28,131 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 20,984 మంది పరీక్షకు హాజరయ్యారని అన్నారు. వారిలో 14,829 (70.67 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని వివరించారు. 11,671 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 8,645 మంది పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 5,569 (64.42 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు.
ముగ్గురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసినా వారు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు. మూడేండ్ల లా కోర్సుకు 28,877 మంది దరఖాస్తు చేయగా, 21,160 మంది పరీక్ష రాశారనీ, వారిలో 14,017 (66.24 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని అన్నారు. ఐదేండ్ల లా కోర్సుకు 7,644 మంది దరఖాస్తు చేస్తే, 5,793 మంది పరీక్షకు హాజరయ్యారనీ, వారిలో 3,846 (66.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఎల్ఎల్ఎం కోర్సుకు 3,284 మంది దరఖాస్తు చేయగా, 2,676 మంది పరీక్షకు హాజరైతే, 2,535 (94.73 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. లాసెట్ కన్వీనర్ జిబి రెడ్డి మాట్లాడుతూ లా కాలేజీలకు బార్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. గత విద్యాసంవత్సరంలో మూడేండ్ల లా కోర్సుకు సంబంధించి 24 కాలేజీల్లో 4,210 సీట్లున్నాయని అన్నారు. ఐదేండ్ల లా కోర్సుకు సంబంధించి 19 కాలేజీల్లో 1,580 సీట్లున్నాయని వివరించారు. ఎల్ఎల్ఎం కోర్సుకు సంబంధించి 15 కాలేజీల్లో 738 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మూడేండ్ల లా కోర్సులో 120కి 106 మార్కులతో గణేష్ శస్త షరణ్ ప్రథమ ర్యాంకు పొందారు. ఐదేండ్ల లా కోర్సులో 99 మార్కులతో డి శ్రీధర్రెడ్డి, ఎల్ఎల్ఎంలో 100 మార్కులతో బి దీక్ష అగ్రస్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ వీసీ డి రవీందర్, లా కాలేజీ డీన్ గాలి వినోద్కుమార్, ప్రవేశాల కన్వీనర్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.